కాల్షియం మాత్రలు వేసుకుంటే గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయా?

ఆదివారం, 14 మార్చి 2021 (20:30 IST)
గుండె, ఎముక, దంత, నరాలు, రక్త ఆరోగ్యానికి కాల్షియం చాలా ముఖ్యమైనది. 50 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు గల పురుషులు మరియు మహిళలకు రోజుకు 1,000 నుండి 1,200 మిల్లీగ్రాముల క్యాల్షియం అవసరం.
 
పాల ఉత్పత్తులు, ఆకుకూరలు, బలవర్థకమైన నారింజ రసం, బాదం వంటి వాటిలో క్యాల్షియం పుష్కలంగా వుంటుంది. చాలా మంది ప్రజలు రోజుకు కనీసం 700 మి.గ్రా క్యాల్షియాన్ని ఆహారం నుండి పొందవచ్చు. చాలామంది ఎక్కువ పొందుతారు. మీ ఆహారంలో మీకు లభించే వాటిని భర్తీ చేయడానికి మీరు కాల్షియం మాత్ర తీసుకుంటే, తక్కువ మోతాదు మాత్ర (500 మి.గ్రా వంటివి) చాలా మందికి సరిపోతుంది.
 
కాల్షియం మందులు గుండె జబ్బులకు కారణమవుతాయా అనే దానిపై పలు అనుమానాలు తలెత్తాయి. ఐతే కాల్షియం మందులు మరియు గుండెపోటు, స్ట్రోక్ లేదా అకాల మరణాలకు క్యాల్షియం మాత్రలే కారణమన్నది పూర్తిగా నిర్థారణ కాలేదు.
 
ఐతే కాల్షియం ఇష్టమొచ్చినంత స్థాయిలో శరీరానికి అందజేసేందుకు విపరీతంగా మాత్రలు తీసుకోవచ్చని దీని అర్థం కాదు. అధికంగా తీసుకోవడం రక్తంలో కాల్షియం యొక్క సాధారణ స్థాయి హైపర్కాల్సెమియాకు దారితీస్తుంది. ఇది వికారం, వాంతులు, గందరగోళం, ఇతర నాడీ లక్షణాలకు కారణమవుతుంది.
 
అధిక కాల్షియం సప్లిమెంట్ తీసుకోవడం మూత్రపిండాల వ్యాధి, ప్రోస్టేట్ క్యాన్సర్‌కు కూడా దారితీసే అవకాశం లేకపోలేదంటున్నారు. కనుక క్యాల్షియంను ఆహారం ద్వారా శరీరానికి అందజేయడం మేలు. అలా కాకుండా క్యాల్షియం మాత్రలు వేసుకుంటే, కొన్నిసార్లు అది అనర్థానికి దారితీయవచ్చు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు