ఓట్స్ ఒక మంచి పౌష్టికాహారం. దీనిలో పీచు పదార్థం, విటమిన్ బి-2, విటమిన్ సి అధికశాతంలో ఉన్నాయి. అలాగే కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్స్ కూడా వీటిలో పుష్కలంగా దొరుకుతుంది. పిల్లలకు ఆహారంలో ఓట్స్ను ఏదో ఒక రూపంలో ఇవ్వడం వల్ల మంచి పోషక విలువలు లభిస్తాయి. ఓట్స్కి జిగురు గుణాన్ని తెచ్చిపెట్టే కరిగే పీచు రక్తంలోని కొలెస్ట్రాల్ను వేరుచేస్తూ.. దాన్ని తగ్గించటంలో తోడ్పడుతుంది. ఇవి తినడం వల్ల చాలా లాభాలు వున్నాయి. ఇంతకీ ఓట్స్ తినడం వల్ల కలిగే లాభాలేంటో ఒక్కసారి చూద్దాం.
ఒక 40 గ్రాముల ఓట్స్లో రోజుకి సరిపడా మెగ్నీషియం ఉంటుంది. రక్తపోటుని నియంత్రిండానికీ, రక్తనాళాలు కుంచించుకుపోకుండా ఉండటానికీ ఈ మెగ్నీషియం తోడ్పడుతుంది. దానివల్ల అకస్మాత్తుగా గుండెపోటు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. రక్తంలో చక్కెర నిల్వలను నియంత్రించేందుకు, ఇన్సులిన్ ఉత్పత్తి సక్రమంగా ఉండేందుకు కూడా ఈ మెగ్నీషియం తోడ్పడుతుంది.