సాధారణంగా కాల్షియం వంటి రసాయనాల గాఢత విపరీతంగా పెరిగిపోవటంవల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడుతుంటాయి. ఆపరేషన్ ద్వారా వీటిని తొలగించినప్పటికీ, మళ్లీ మళ్లీ రాళ్లు ఏర్పడుతూనే ఉంటాయి. ఇలాంటివారు రోజుకో గ్లాసెడు నారింజ రసాన్ని తీసుకున్నట్లయితే రాళ్లు క్రమంగా తొలగిపోతాయి. అలాగే పొటాషియం సిట్రేట్ సప్లిమెంట్లు వాడకం ద్వారా కూడా సమస్యను నివారించవచ్చు.