బరువు తగ్గాలని ప్రయత్నించేవారు డైట్లు, వెయిట్లు అంటూ హైరానాపడుతూ ఉంటారు. ఇటువంటి వారికి సరికొత్త డైట్ డ్రింక్ను అమెరికా వైద్య కళాశాల శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. కూరగాయల రసం తాగితే అధిక బరువు వున్న పెద్దవారిలో ఎంతో మార్పు కనిపించినట్లు వారు చెబుతున్నారు. సోడియం తక్కువగా వుండే వెజిటెబుల్ జ్యూస్ ప్రతిరోజూ తాగినవారు 12 వారాల్లో రెండు కేజీల బరువు తగ్గినట్లు చెబుతున్నారు.
జ్యూస్ను టమోటాలతో కలిపి అన్ని రకాల కూరగాయలు వేసి చెయ్యాలి. ఈ జ్యూస్ను తీసుకోవడం వల్ల కడుపు నిండినట్లు అనిపిస్తుంది. అప్పుడు ఆహార పదార్థాలు తక్కువ తీసుకుంటారు. డిన్నర్ తీసుకునే ముందు ఓ గ్లాస్ వెజిటేబుల్ జ్యూస్ సిప్ చేస్తే, మిగిలిన చిరుతిళ్ళ జోలికి వెళ్ళడం కూడా చాలావరకు తగ్గుతుంది. శరీరానికి కావలసిన పోషకాలు కూడా లభిస్తాయి. కూరగాయలలోని సాల్యుబుల్ పీచు, తక్కువ సోడియం శాతాలు అధిక బరువును నియంత్రించడంలో ఎంతో సాయపడతాయి. పాలకూర, కీరా, సొరకాయ వంటివి ఈ జ్యూస్లో ఉపయోగించినట్లైతే మరింత మంచిదని వారు చెబుతున్నారు. ఇలా కూరగాయల జ్యూస్ తీసుకోవడం వల్ల ఆరోగ్యం, అందం రెండూ సొంతం చేసుకోవచ్చని చెబుతున్నారు. మొత్తంమీద శాకాహారమే కాదు కూరగాయల జ్యూస్లు కూడా గొప్ప మేలే చేస్తాయన్న మాట!