రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

సిహెచ్

మంగళవారం, 25 మార్చి 2025 (18:56 IST)
అమరావతి: కాలిఫోర్నియాలోని బాదం పప్పు బోర్డు నేడు వివాంతా హోటల్లో "రోజుకు ఒక గుప్పెడు బాదం పప్పులు: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడటానికి సహజ విధానం" అనే శీర్షికతో విశిష్ట పరిజ్ఞానంతో కూడిన సెషన్‌ను నిర్వహించింది. ఈ సెషన్‌లో న్యూట్రిషన్-వెల్నెస్ కన్సల్టెంట్, షీలా కృష్ణ స్వామి; ప్రముఖ భారతీయ మోడల్, అందాల పోటీ టైటిల్ విజేత, వ్యవస్థాపకురాలు ప్రజ్ఞా అయ్యగారి సహా గౌరవనీయమైన ప్యానెలిస్టులు పాల్గొన్నారు. వారు బుద్ధిపూర్వక ఆహార ఎంపికలు, సమతుల్య ఆహారాన్ని నిర్వహించడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. చర్చ సందర్భంగా, భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన కాలిఫోర్నియా బాదం పప్పులను రోజువారీ ఆహారంలో చేర్చడం, నేటి వేగవంతమైన జీవితంలో మొత్తం ఆరోగ్యానికి ఎలా తోడ్పడుతుందో ప్యానెలిస్టులు వెల్లడించారు. ఈ సెషన్‌కు ఆర్‌జె సౌజన్య సంధానకర్తగా వ్యవహరించారు.
 
నేటి వేగవంతమైన ప్రపంచంలో, సమతుల్య, ఆరోగ్యకరమైన జీవనశైలిని సాధించడం చాలా కష్టంగా మారింది, దీనివల్ల మధుమేహం, గుండె జబ్బులు, ఊబకాయం వంటి జీవనశైలి వ్యాధులు పెరుగుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) అంచనా ప్రకారం, ఈ జీవనశైలి వ్యాధులు భారతదేశంలో ఏటా ఆరు మిలియన్ల మంది ప్రాణాలను బలిగొంటున్నాయి. దీర్ఘకాలిక అనారోగ్యాలు 2030 నాటికి దేశానికి $6 ట్రిలియన్ల నష్టం కలిగిస్తాయని అంచనా. ఈ ఆరోగ్య సంక్షోభానికి పేలవమైన ఆహార ఎంపికలు ప్రధాన కారణం.
 
ఈ చర్చ సందర్భంగా, అనుభవజ్ఞురాలైన పోషకాహార నిపుణురాలు సమతుల్య ఆహారాన్ని నిర్వహించడం, సరైన ఆరోగ్యం కోసం బాదం వంటి సహజ ఆహారాలను చేర్చడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. డ్రై ఫ్రూట్స్‌లో రారాజు అయిన కాలిఫోర్నియా బాదంలు ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, మెగ్నీషియం, కాల్షియం, డైటరీ ఫైబర్, జింక్ వంటి 15 ముఖ్యమైన పోషకాలతో సమృద్ధిగా ఉన్నాయని, రక్తంలో చక్కెర నియంత్రణ, బరువు నిర్వహణ, రోగనిరోధక శక్తిని పెంచడం, చెడు- మొత్తం కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడం వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయని ఆమె వెల్లడించారు.
 
అదనంగా, అత్యంత కష్టతరమైన తన షెడ్యూల్‌ను నిర్వహించడానికి ప్రజ్ఞా తాను అనుసరించే విధానాన్ని పంచుకున్నారు. పోషకాలు అధికంగా ఉండే  బాదం వంటి ఆహారాలకు ప్రాధాన్యత ఇవ్వడం, భోజన ప్రణాళిక, క్రమం తప్పకుండా యోగా- వ్యాయామం, ధ్యానం వంటివి చేస్తానని వెల్లడించారు. కాలిఫోర్నియాలోని ఆల్మండ్ బోర్డ్‌తో కలిసి ఇటీవల నిర్వహించిన యు గేవ్ సర్వేను కూడా ఈ చర్చలో ప్రస్తావించారు, భారతదేశంలోని అగ్రగామి 5 శాఖాహార ప్రోటీన్ వనరులలో బాదం స్థానం పొందిందని అది వెల్లడించింది. ఈ సర్వే ప్రకారం, అన్ని ప్రాంతాలలో 10 మందిలో ఆరుగురు కంటే ఎక్కువ మంది బాదంను అధిక ప్రోటీన్ వనరుగా గుర్తిస్తున్నారు. 10 మందిలో 8 మంది స్పందనదారులు తాము ప్రతిరోజూ బాదంను తీసుకుంటామని చెప్పారు, ఇది భారతదేశంలో పోషకమైన చిరుతిండిగా గింజల ప్రజాదరణను బలోపేతం వెల్లడిస్తుంది.
 
న్యూట్రిషన్- వెల్నెస్ కన్సల్టెంట్ షీలా కృష్ణస్వామి మాట్లాడుతూ, “మన బిజీ జీవనశైలి తరచుగా అనారోగ్యకరమైన ఆహార ఎంపికలకు దారితీస్తుంది. చిన్న మార్పులు పెద్ద తేడాను కలిగిస్తాయని నేను నమ్ముతున్నాను. అల్ట్రా-ప్రాసెస్డ్ స్నాక్స్‌‌కు బదులుగా బాదం వంటి సహజ ఎంపికలను చేసుకోవటం వంటివి దీనిలో వున్నాయి. ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్‌తో సహా 15 ముఖ్యమైన పోషకాలతో నిండిన బాదం మీరు సంతృప్తి చెందడానికి, ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడానికి, గుండె ఆరోగ్యం, రక్తంలో చక్కెర నిర్వహణ, మెరుగైన చర్మానికి మద్దతు ఇస్తుంది. వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితంలో బహుళ బాధ్యతలను నిర్వహించేటప్పుడు, ఈ సరళమైన, తెలివైన ఆహార ఎంపికలు మొత్తం ఆరోగ్యం, శ్రేయస్సును కాపాడుకోవడంలో శక్తివంతమైన మిత్రులుగా మారతాయి” అని అన్నారు. 
 
భారతీయ మోడల్, అందాల పోటీ టైటిల్ విజేత-వ్యవస్థాపకురాలు, ప్రజ్ఞ అయ్యగారి మాట్లాడుతూ, “మోడలింగ్ పరిశ్రమలో ఉండటం వల్ల, ఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగించడానికి ప్రయత్నిస్తూనే నేను తరచుగా షూట్‌లలో పాల్గొంటుంటాను. నా బిజీ షెడ్యూల్‌కు సరిపోయే పోషకమైన, సహజమైన, అనుకూలమైన స్నాక్స్ కోసం నేను ఎల్లప్పుడూ వెతుకుతుంటాను. బాదం పప్పులు చిన్నప్పటి నుండి నాకు ఇష్టమైనవి. అవి ఎక్కువసేపు కడుపు నిండుగా ఉందనే భావన కలిగిస్తాయి, బరువు నిర్వహణకు మద్దతు ఇస్తాయి. అనారోగ్యకరమైన చిరుతిండిని నివారించడానికి నాకు సహాయపడతాయి. నా దినచర్యలో బాదం పప్పును చేర్చుకోవడం వల్ల నా చర్మంతో సహా నా మొత్తం ఆరోగ్యంలో స్పష్టమైన తేడా వచ్చింది. నేను వాటిని వాటి సహజ రూపంలో తినడానికి ఇష్టపడతాను, నేను ఎక్కడికి వెళ్లినా ఎల్లప్పుడూ నాతో ఒక పెట్టెను తీసుకెళ్లడం మాత్రం మరువను” అని అన్నారు.
 
మొత్తం ఆరోగ్యంను మెరుగుపరచడానికి బాదం వంటి పోషకాలు అధికంగా ఉండే ఆహారాలను రోజువారీ దినచర్యలలో చేర్చడం యొక్క ప్రాముఖ్యతను ఈ చర్చ నొక్కి చెప్పింది. నేటి వేగవంతమైన ప్రపంచంలో పోషకాహారానికి ప్రాధాన్యత ఇవ్వడం స్థిరత్వంను బలోపేతం చేయగలదని, ఆరోగ్యకరమైన పని-జీవిత సమతుల్యతకు మద్దతు ఇవ్వగలదని ప్యానెలిస్టులు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు