అరుదైన ప్రోస్టేట్ క్యాన్సర్‌ రోగికి విజయవంతంగా చికిత్సనందించిన హైదరాబాద్‌లోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

ఐవీఆర్

మంగళవారం, 30 జులై 2024 (22:32 IST)
హైదరాబాదులోని సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ (ఏఓఐ) తీవ్రస్థాయి ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న 72 ఏళ్ల పురుషునికి విజయవంతమైన చికిత్సను అందించినట్లు వెల్లడించింది. ఈ రోగి, తొలుత 2014లో తీవ్రమైన మూత్ర విసర్జన సమస్యలను ఎదుర్కొన్నాడు, ఏఓఐలో అందుబాటులో ఉన్న నైపుణ్యం, అధునాతన సంరక్షణను అతని సంక్లిష్టమైన, వైవిధ్యమైన చికిత్సా ప్రయాణం చెబుతుంది. 
 
2014లో అర్జున్ శెట్టి (పేరు మార్చబడింది) తీవ్రమైన మూత్ర సమస్యలను ఎదుర్కొన్నాడు. అతను నగరంలోని మరొక ఆసుపత్రిలో యూరాలజిస్ట్‌ను సంప్రదించాడు. ఆ సమయంలో అతనికి మందులు రాసేవారు. అతనికి పరీక్షలలో భాగంగా చేసిన బయాప్సీ ప్రోస్టేట్ కార్సినోమాను నిర్దారించింది. అప్పుడు అతను బైలాటరల్ ఆర్కిడెక్టమీ (శస్త్రచికిత్స ద్వారా వృషణాలను తొలగించటం) చేయించుకున్నాడు. దీని తర్వాత అతనికి పలుమార్లు క్యాన్సర్‌ తిరిగి కనిపించటంతో పాటుగా పలుమార్లు కీమోథెరపీల చికిత్స కూడా మరోచోట పొందారు.
 
అతను వ్యాధి పునరావృతం అవుతుండటంతో 2022లో ఏఓఐ కి వచ్చాడు; ఆశ్చర్యకరంగా, అతని పిఎస్ఏ చాలా తక్కువగా ఉంది. అతను వ్యాధి పురోగతిని కలిగి ఉన్నాడు, కానీ చాలా తక్కువ  పిఎస్ఏ తో వున్నాడు , ఏఓఐ లోని వైద్యులు అతని వ్యాధి పరివర్తన కోసం మళ్లీ బయాప్సీ చేయాలని నిర్ణయించారు. ఇది ప్రోస్టేట్ కార్సినోమా యొక్క పరివర్తన కణ రూపాంతరాన్ని వెల్లడించింది. అతని వయస్సు, బలహీనత, గతంలో అనేక కీమోథెరపీలు జరగటం మరియు చాలా అరుదైన హిస్టాలజీని పరిగణనలోకి తీసుకుని, తరువాతి తరం సీక్వెన్సింగ్ కణితి కణజాలంపై ప్రయత్నించబడింది. అతని కణితి కణజాలం MSI హై  మరియు TMB హై స్టేటస్ కి సానుకూలంగా ఉంది, ఇది రోగనిరోధక చికిత్సకు హామీ ఇచ్చింది.
 
డాక్టర్ కె.వి. కృష్ణమణి, మెడికల్ ఆంకాలజిస్ట్, ఏఓఐ , హైదరాబాద్ తాము చేసిన బహుళ అంచెల చికిత్సా విధానం గురించి వివరిస్తూ , "ప్రోస్టేట్ క్యాన్సర్ యొక్క అధునాతన స్వభావం కారణంగా రోగి కేసు సవాలుగా మారింది. మా బృందం NSG / మాలిక్యులర్ టెస్టింగ్ / ఇమ్యునోథెరపీని కలిపి ఉపయోగించింది. ఈ సమగ్ర విధానం క్యాన్సర్‌ సమస్యను మాత్రమే పరిష్కరించలేదు. అతని జీవన నాణ్యతను సైతం పెంచింది. చికిత్సకు అతని ప్రతిస్పందన ప్రోత్సాహకరంగా ఉంది, ఇది ఏఓఐ యొక్క అధునాతన సంరక్షణ సామర్థ్యాలను ప్రదర్శిస్తుంది, ఈ వయస్సులో ఉన్న రోగికి ఈ అరుదైన ప్రోస్టేట్ క్యాన్సర్‌ కు  ఇమ్యునోథెరపీతో విజయవంతంగా చికిత్స అందించబడటం, అద్భుతమైన ఫలితాలను సాధించడం,  ప్రపంచ వ్యాప్తంగా అతి కొద్ది కేసులలో మాత్రమే కనిపించింది " అని అన్నారు. 
 
అతను ప్రతి 3 వారాలకు ఇమ్యునోథెరపీని పొందాడు మరియు ఇమ్యునోథెరపీ ప్రారంభమైన 2 సంవత్సరాల తరువాత  అతను  వ్యాధి నుంచి పూర్తిగా ఉపశమనం పొందాడు. అతను 2022లో ఉన్నదానికంటే వైద్యపరంగా బాగానే ఉన్నాడు, తిరగగలుగుతున్నాడు మరియు చాలా మెరుగ్గా ఉన్నాడు. ఈ కేసు అత్యంత ప్రత్యేకమైన పరమాణు పరీక్షల అవసరాన్ని, క్యాన్సర్ పునరావృతమయ్యే సందర్భాల్లో పునరావృత బయాప్సీ అవసరాన్ని మరియు ఈ తరహా రోగులలో ఇమ్యునోథెరపీతో అద్భుతమైన ఫలితాలను సాధించటం  హైలైట్ చేస్తుంది.
 
సిటిఎస్ఐ - దక్షిణాసియా సీఈఓ  హరీష్ త్రివేది మాట్లాడుతూ , "ఈ కేసు క్యాన్సర్ చికిత్సలో అత్యాధునిక మాలిక్యులర్ డయాగ్నస్టిక్స్ మరియు వ్యక్తిగతీకరించిన ఔషధం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తుంది. ఏఓఐలో అధునాతన సాంకేతికత మరియు పరిశోధన పై  మా పెట్టుబడి వీలైనంతగా ఆంకాలజీ కేర్‌లో హద్దులను అధిగమిస్తుంది. ఈ కేసు విజయం ప్రపంచ స్థాయి క్యాన్సర్ చికిత్సను అందించడంలో ఏఓఐ హైదరాబాద్‌లోని మా బృందం యొక్క అసాధారణ సామర్థ్యాలను మరియు అంకితభావాన్ని హైలైట్ చేస్తుంది..." అని అన్నారు 
 
హైదరాబాద్‌లోని ఏఓఐ రీజినల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ ప్రభాకర్ పి ఈ కేసు యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ "ఈ విజయవంతమైన ఫలితం అత్యాధునిక క్యాన్సర్ సంరక్షణను అందించడంలో మా నిబద్ధతను నొక్కి చెబుతుంది. సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ నిపుణుల క్లినికల్ పరిజ్ఞానం, వ్యక్తిగతీకరించిన చికిత్స ప్రణాళికలను అందించడానికి అధునాతన సాంకేతికతను అనుసంధానిస్తుంది.   మా రోగులకు సాధ్యమైనంత ఉత్తమమైన ఫలితాలను సాధించడంలో మా బృందం యొక్క అంకితభావం  పట్ల మేము గర్విస్తున్నాము" అని అన్నారు. 
 
పురుషులలో కనిపించే అత్యంత సాధారణ క్యాన్సర్లలో ప్రోస్టేట్ క్యాన్సర్ ఒకటి. దీనిని ముందుగా గుర్తించడం చికిత్స ఫలితాలను గణనీయంగా మెరుగుపరుస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఇటీవలి డేటా ప్రకారం, ప్రారంభ దశలో ఉన్న ప్రోస్టేట్ క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించినప్పుడు దాదాపు 100% ఐదేళ్ల మనుగడ రేటు ఉంటుంది. డాక్టర్ కృష్ణమణి కె వి మాట్లాడుతూ , "ప్రోస్టేట్ క్యాన్సర్‌ను సమర్థవంతంగా నిర్వహించడంలో రెగ్యులర్ స్క్రీనింగ్‌లు మరియు ముందస్తుగా గుర్తించడం చాలా కీలకం. మేము 50 ఏళ్లు పైబడిన పురుషులందరినీ మరియు వ్యాధి యొక్క కుటుంబ చరిత్ర కలిగిన వారందరినీ సాధారణ పరీక్షలు  మరియు స్క్రీనింగ్‌లు చేయించుకోవాలని మేము ప్రోత్సహిస్తున్నాము" అని అన్నారు. 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు