జామ ఆకుల కషాయం చేసే మేలు (video)

గురువారం, 6 అక్టోబరు 2022 (23:16 IST)
జామ ఆకులు దగ్గు నుండి ఉపశమనం కలిగిస్తాయి. జామ ఆకులు జలుబు, దగ్గు, శ్లేష్మం నుండి ఉపశమనం కలిగిస్తాయి. వీటిని ఎలా ఉపయోగిస్తే ఉపశమనం కలుగుతుందో తెలుసుకుందాం.
 
దగ్గు నుండి ఉపశమనం కోసం జామ ఆకులతో చేసిన డికాషన్ తీసుకోవాలి. జామ ఆకులను నీళ్లలో వేసి మరిగించి అల్లం, ఎండుమిర్చి, లవంగాలు, యాలకులు, వెల్లుల్లి, బెల్లం వేసి కషాయం చేయాలి. జామ ఆకుల పొడిని తీసుకోవడం వల్ల శ్వాసకోశ, ఊపిరితిత్తులు, గొంతులోని బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది.
 
బెల్లం, గోరువెచ్చని నీటితో జామ ఆకుల పొడిని తీసుకోండి. జామ ఆకులను నీటిలో వేసి మరిగించి తాగితే దగ్గు తగ్గిపోతుంది. జామ ఆకు టీలో బెల్లం కలిపి తాగితే ఉపశమనం కలుగుతుంది. జామ ఆకుల పొడిని గోరువెచ్చని నీటిలో నిమ్మరసం మరియు తేనె కలిపి కూడా తీసుకోవచ్చు. ఏదైనా నివారణకు చిట్కాలు పాటించే ముందు, దయచేసి వైద్యుడిని సంప్రదించండి.

 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు