మధుమేహానికి దివ్యౌషధంగా పని చేసే ఆవాలు

సోమవారం, 8 ఏప్రియల్ 2019 (11:41 IST)
ఈ రోజుల్లో మధుమేహంతో బాధపడేవారు చాలా మంది ఉన్నారు. దీనికి శాశ్వత పరిష్కారం లేదు. అయితే కొన్ని ఆహార నియమాలను పాటించడం ద్వారా దానిని నియంత్రించవచ్చు. ముఖ్యంగా డయాబెటిస్ అనేది ఇన్సులిన్ వైఫల్యం వల్ల వస్తుంది. పాంక్రియాటిక్ గ్రంధిలో తయారయ్యే ఈ హార్మోన్ రక్తంలోని షుగర్‌ను నియంత్రిస్తుంది. 
 
ఈ వ్యాధికి ఆవాలు దివ్యాఔషధంగా పని చేస్తాయి. రోజువారీ ఆహారంలో ఆవాలు చేర్చుకుంటే తప్పక ఫలితం ఉంటుంది. ఆవాలు మనకు చేసే మేలు గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. కప్పు ఆవాలను పొడిచేసుకుని అందులో కొద్దిగా చక్కెర లేదా తేనె కలిపి తీసుకుంటే వ్యాధి అదుపులో ఉంటుంది. అలాగే ఈ పొడిలో కొద్దిగా నూనె కలిపి ఇడ్లీ, దోసవంటి వాటికి సైడ్‌డిష్‌గా తింటే చాలా రుచిగా ఉంటుంది. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. 
 
ఆవాలను బాగా ఎండబెట్టి నూనెలో వేయించుకుని అందులో కొన్ని ఉల్లిపాయ ముక్కలు, అల్లం పేస్ట్, ఉప్పు, చిటికెడు పసుపు వేసి బాగా వేయించుకుని తీసుకుంటే మధుమేహ వ్యాధిని అదుపులో ఉంచవచ్చు. ఆవాల పొడిని రోజుకు మూడు పూటలా స్పూన్ మోతాదులో తీసుకుంటే రక్తంలోని షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉంటాయి. ఆవాలలోని విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్ జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో దోహదపడతాయి. 
 
శరీరానికి అవసరమైన పోషక విలువలను అందిస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఆవాలను నెయ్యిలో వేయించి అందులో కొద్దిగా ఉప్పు, కరివేపాకు చేర్చి పొడి చేసుకోవాలి. తయారుచేసిన ఈ మిశ్రమాన్ని రోజు అన్నంలో కలిపి సేవిస్తే వ్యాధి తగ్గుముఖం పడుతుంది. కప్పు పెరుగులో కొద్దిగా ఆవాల పొడి, ఉప్పు, కొత్తిమిర వేసి తింటే రక్తప్రసరణ సాఫీగా జరుగుతుంది. తరచుగా ఆవాలతో చేసిన ఆహార పదార్థాలు తీసుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలైన తొలగిపోతాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు