ప్రతి ఒక్కరూ నిద్రలేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంతవరకు వివిధ రకాల ఆహార పదార్థాలను ఆరగిస్తుంటాం. వీటిలో ద్రవపదార్ధాలతో పాటు ఘన పదార్ధాలూ ఉంటాయి. వీటిలో కొన్ని రకాల ఆహార పదార్థాలు జీర్ణంకాకపోవచ్చు. తద్వారా కడుపులో మంట ఏర్పడుతుంది. వికారంగా ఉంటుంది. ఇలా ఎందుకొస్తుందో తెలీదు. కొందరికి కడుపు ఖాళీ అయితే నొప్పి వస్తుంది. మరి కొందరికి కడుపు నిండితే నొప్పుపుడుతుంది.
వీటన్నింటికీ కారణం అల్సర్. ఈ సమస్య బారినపడటానికి కారణం మారిన జీవనశైలే. కాలంతో పరుగులు, వేళకు తీసుకోని ఆహారం, ఒకవేళ తీసుకున్నా హడావిడిగా.. గబగబా తినేయటం.. చీటికి మాటికి చిరాకు, అకారణం లేకుండానే కోపం, టెన్షన్, వీటితోపాటు నిత్యం ఎదుర్కొనే రకరకాల మానసిక ఒత్తిళ్ళు తోడుకావడంతో జీర్ణకోశంలో అల్సర్ సమస్యలను పెంచుతున్నాయి. అలాంటి అల్సర్ సమస్యకు ఇంట్లోనే చిన్నపాటి చిట్కాలు పాటించవచ్చు.
* ఇలాంటి చిట్కాలు పాటించడం వల్ల అల్సర్లు తగ్గుముఖం పడతాయి.
* అన్నింటికంటే ముఖ్యంగా తీసుకునే ఆహారం ఏదైనప్పటికీ ఖచ్చితమైన సమయంలోనే తీసుకోవాలి.