కొబ్బరి దోశ

కేరళలో బాగా ప్రాచుర్యం పొందిన ఈ వంటకం తయారు చేయడం కూడా చాలా సులభమే. వేసవి శెలవుల్లో పిల్లలకు అల్పాహారంగా చేసి పెడితే బావుంటుంది.

కావాల్సిన పదార్థాలుః
పచ్చి బియ్యం- గ్లాసెడు
కొబ్బరికాయ- 1
జీలకర్ర - కొద్దిగా.
ఉప్పు -తగినంత

తయారు చేసే విధానం
పచ్చిబియ్యాన్ని నీటితో శుభ్రం చేసి, నాలుగు గంటల పాటు నానబెట్టాలి. కొబ్బరిని తురుము చేయడం లేక ముక్కలుగానో చేసి పెట్టుకోవాలి. బియ్యం, కొబ్బరిని కలిపి బాగా రుబ్బాలి. మధ్యలో ఉప్పు కూడా వేసి రుబ్బాలి.

మరుసటి రోజు ఉదయం ఈ పిండిలో కొంత తీసుకుని జావలా కాచి, తిరిగి పిండిలోనే కలిపాలి. జీలకర్ర వేసి, కలిపి, మనకు నచ్చిన రీతిలో దోశ కాల్చుకోవచ్చు.
కొబ్బరి కలిపి కాల్చేందువల్ల దోశె కూడా బాగా వస్తుంది. కొబ్బరి చట్నీ లేక కారం చట్నీ అయితే చక్కటి సైద్ డిష్ కాగలవు.

వెబ్దునియా పై చదవండి