ఓటర్ల జాబితాల ప్రత్యేక సమీక్ష, తనిఖీ రాజ్యాంగవిరుద్ధమని, ఓటర్ల ఓటు హక్కును హరించేదిగా ఉందంటూ వివిధ ప్రతిపక్షాలు వేసిన పిటిషన్పై ఈ తరహా వ్యాఖ్యలు చేసింది.
ముందుగా వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సిన అస్సాం, కేరళ, బెంగాల్, తమిళనాడు, పుదుచ్చేరిల్లో ఈ ప్రక్రియ చేపడతారు. విపక్షాలు పిటిషన్ వేసిన మర్నాడే అంటే ఈ నెల 5న జాబితాల సమీక్షకు సన్నాహాలు మొదలు పెట్టాలని ఆదేశిస్తూ ఈసీ అన్ని రాష్ట్రాల ఎన్నికల ప్రధానాధికారు(సీఈవో)లకు లేఖ రాసింది.
వచ్చే యేడాది జనవరి ఒకటో తేదీ నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలని.. 18 ఏళ్లు నిండినవారికి ఓటు హక్కు కల్పించాలని స్పష్టం చేసిందని జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. కాగా, బీహార్లో చేపట్టిన తనిఖీల్లో బంగ్లాదేశ్, మయన్మార్, నేపాల్ దేశాల నుంచి అక్రమంగా వచ్చిన వారికి ఓటు హక్కు ఉన్నట్టు గుర్తించి విషయం తెల్సిందే.