కావలసిన పదార్థాలు : లేత పొట్టేలు మాంసం.. ఒక కేజీ నూనె.. తగినంత ఉల్లిపాయలు.. ఎనిమిది చుక్కకూర.. రెండు కట్టలు వెల్లుల్లి.. 14 రేకలు పచ్చిమిర్చి.. ఎనిమిది యాలకులు.. నాలుగు లవంగాలు.. ఐదు దాల్చిన చెక్క.. మూడు అల్లం.. కాస్తంత పసుపు, ఉప్పు, కారం.. తగినంత ధనియాలు.. తగినన్ని కొత్తిమీర.. 3 పెద్ద కట్టలు
తయారీ విధానం : ముందుగా మటన్ను శుభ్రంగా కడిగి, కావాల్సిన సైజులో కోసుకోవాలి. యాలకులు, లవంగాలు, ధనియాలు, వెల్లుల్లి, దాల్చిన చెక్కలను కలిపి మెత్తగా నూరుకోవాలి. చుక్కకూరను సన్నగా తరిగి ఉంచాలి. ఉల్లి, పచ్చిమిర్చిలను సన్నగా కోసుకోవాలి. అల్లం, వెల్లుల్లిలను మెత్తగా నూరి ఉంచాలి. ఇప్పుడు స్టౌపై గిన్నె పెట్టి నూనె పోసి బాగా కాగిన తరువాత ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలను వేయించాలి.
అందులో మాంసం ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్లను.. ఉప్పు, కారం, పసుపులను వేసి బాగా కలియబెట్టి నీళ్లుపోసి ఉడికించాలి. మాంసం బాగా మెత్తబడేలా ఉడికిన తరువాత పైన చుక్కకూరను చల్లి, బాగా కలిపి ఉడికిన తరువాత దించేయాలి. చివర్లో సన్నగా తరిగిన కొత్తిమీరతో అలంకరించి సర్వ్ చేయాలి. అంతే చుక్కకూరతో మటన్ కర్రీ తయార్..!!