కావలసిన పదార్థాలు : కందిపప్పు... అర కేజీ గడ్డపెరుగు... రెండు కప్పులు మీగడ... రెండు కప్పులు నూనె... రెండు టీ. పసుపు... రెండు టీ. ఉప్పు... తగినంత కారం... నాలుగు టీ. వెల్లుల్లిపాయలు... రెండు టొమోటోలు... ఎనిమిది నెయ్యి... ఎనిమిది టీ. వెన్న... రెండు నిమ్మకాయలంత
తయారీ విధానం : బాణలిలో నూనె వేసి కందిపప్పు 5 నిమిషాలు వేయించి తీసి శుభ్రంగా కడగాలి. టొమాటోలు ముక్కలుగా కోయాలి. ప్రెషర్పాన్లో పప్పు, తగినన్ని నీళ్లు పోసి ఉప్పు, పసుపు, కారం కూడా వేసి నీళ్లన్నీ ఇగిరేవరకూ ఉడికించాలి. తరవాత పెరుగు వేసి బాగా కలపాలి.
మరో బాణలిలో నెయ్యి వేసి వెల్లుల్లి గోధుమరంగులోకి మారేవరకూ వేయించి టొమాటో ముక్కలు కూడా వేసి ఉడికించాలి. ఇవి ఉడికిన తరవాత ఈ మిశ్రమాన్ని పప్పులో కలిపి పైన వెన్న ఉంచి మూతపెట్టాలి. దీన్ని వేడివేడిగా పరాటా, చపాతీ, పూరీల్లోకి తింటే భలే రుచిగా ఉంటుంది.