కావలసిన పదార్థాలు : మైదా: ఒకకప్పు వంటసోడా: చిటికెడు బొంబాయి రవ్వ : ఒక కప్పు డాల్డా: రెండు టీస్పూన్లు
తయారీ విధానం : మైదా, వంటసోడా, బొంబాయి రవ్వ, డాల్డాను పాన్లో వేసుకుని చపాతీ పిండి ముద్దలా కలుపుకోండి. రెండు గంటల సేపు ఆ పిండిని అలాగే ఉంచండి. రెండు గంటల తర్వాత పిండితో చిన్నిచిన్ని పూరీలుగా చేసుకుని నూనెలో ఫ్రైలా వేయించి దించాలి. ఈ పూరీకి చింతపండు రసం రెండు కప్పులు అందులో పుదినా తరుగు, కొత్తిమీర తరుగు , పచ్చిమిర్చి తరుగులు చెరో అరకప్పు కలిపి మిక్సిలో తిప్పి ఉప్పు కలిపి పెప్పర్ పౌడర్ జీలకర్ర పౌడర్ను చేర్చండి. ఈ సైడిష్ పూరీకి రుచికరంగా ఉంటుంది.