కావలసిన పదార్థాలు : బియ్యపిండి - కప్పు, మైదాపిండి - అరకప్పు, కొబ్బరి - సగం చిప్ప, నీళ్లు - ఒకటిన్నర కప్పులు, జీలకర్ర - చిటికెడు, పచ్చిమిర్చి - ఐదు, నూనె - వేయించడానికి సరిపడ, ఉప్పు - తగినంత.
తయారు చేయు విధానం : ముందుగా కొబ్బరి చిప్పను సన్నగా తురిమి పెట్టుకోవాలి. ఆ తర్వాత మైదా పిండి, బియ్యపిండిలను కలిపి ఇందులో కొబ్బరి తురుమును వేసి కలపాలి. కాస్త మందంగా ఉన్న గిన్నెను స్టవ్ మీద పెట్టి అందులో ఒకటిన్నర కప్పుల నీళ్లు పోసి కాగనివ్వండి.
తర్వాత పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పులను మెత్తగా రుబ్బి కాగుతున్న నీళ్లలో వేయండి. నీళ్లు బాగా కాగిన తర్వాత ఇందులో చెంచా నూనె, పిండుల మిశ్రమం, కొబ్బరి తురుములను వేసి కలపాలి. కాసేపయ్యాక దాన్ని దించేయాలి. నీళ్లు ఆరాక ప్లాస్టిక్ కవరును తీసుకుని దానిపై నూనె రాసి దానిపై పిండి మిశ్రమాన్ని వేసి గుండ్రంగా చేత్తో వత్తి కాగుతున్న నూనెలో వేసి వేయించి దించాలి.