తీసుకోవలసిన పదార్ధాలు: బీట్రూట్ - 2, చింతపండు - నిమ్మకాయంత, రసం పొడి - ఒక టీ స్పూను, అల్లం - 3 ముక్కలు, బెల్లం - అర్ధనిమ్మకాయంత, పసుపుపొడి - అరస్పూను, నెయ్యి - ఒక టేబుల్ స్పూను, ఉప్పు - సరిపడేంత, వెల్లల్లి తరుగు, కొత్తి మీర తరుగు - సరిపడేంత
ఇలా తయారు చేయండి: ముందుగా బీట్రూట్లను శుబ్రంగా కడిగి అనంతంర పై తొక్కను తీసేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. అనంతరం వాటిని కుక్కర్లో ఉడికించిన తర్వాత చల్లార్చాలి. 125 మిల్లీలీటర్ల నీటిలో చింతపండును నానబెట్టాలి. ఇప్పుడు చల్లారిన బీట్రూట్ ముక్కల నుంచి రసాన్ని తీసుకోవాలి.
అలాగే చింతపండు రసాన్ని బీట్రూట్కు కలిపి నెమ్మదిగా వేడి చేయాలి. ఇప్పడు రసం పొడితో పాటు పసుపు, ఉప్పు, బెల్లంలను కలుపుకోవాలి. అదేవిధంగా కొత్తిమీర తరుగును కూడా కలుపుకోవాలి. కొద్ది సమయం పాటు ఈ మిశ్రమాన్ని స్టౌమీద ఉడికించాలి.
తర్వాత అందులో కాస్తంత నెయ్యితో పాటు తరిగిన అల్లం ముక్కలను వేసి మరి కొంత సమయం పాటు స్టౌమీద ఉంచాలి. కొద్దిసేపటి తర్వాత స్టౌమీద నుంచి కిందకు దించితే బీట్రూట్ రసం రెడీ. ఈ రసాన్ని వేడి వేడి అన్నంలో తింటే బావుంటుంది.