ఛత్తీస్గఢ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు తేరుకోలేని షాకిచ్చారు. మద్యం స్కామ్తో పాటు మనీ లాండరింగ్ కేసులో ఆయన కుమారుడు చైతన్య బఘేల్ను పోలీసులు అరెస్టు చేసింది. శుక్రవారం ఉదయం బఘేల్ నివాసంలో సోదాలు నిర్వహించిన అధికారులు ఆ తర్వాత చైతన్యను అదుపులోకి తీసుకున్నారు.
మద్యం స్కామ్లో ఛత్తీస్గఢ్ రాష్ట్ర ఖజానాకు భారీ నష్టం వాటిల్లిందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో బఘేల్ పాత్ర కూడా ఉందని అభియోగాలు నమోదయ్యాయి. దీనిపై కేసు నమోదు చేసిన ఈడీ, మద్యం సిండికేట్కు రూ.2 వేల కోట్ల మేరకు లబ్ది చేకూరిందని పేర్కొంది.
ఈ కేసుకు సంబంధించి గతంలో బఘేల్ నివాసంలో సోదాలు నిర్వహించిన దర్యాప్తు సంస్థ శుక్రవారం మరోమారు తనిఖీలు చేపట్టింది. ఉదయం దుర్గ్ జిల్లాలోని భిలాయ్ ప్రాంతంలో గల బఘేల్ నివాసానికి ఈడీ అధికారులు చేరుకుని చైతన్యను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు సంబంధించి కొత్త ఆధారాలు లభించడంతో మాజీ ముఖ్యమంత్రి నివాసంలో ఈడీ అధికారులు సోదాలు చేశారు. విచారణకు చైతన్య ఏమాత్రం సహకరించకపోవడంతో అరెస్టు చేయకతప్పలేదు.