కావలసిన పదార్థాలు : వంకాయలు.. రెండు చిక్కుడుకాయలు.. వంద గ్రా. అరటికాయ.. సగం టొమోటోలు.. రెండు పాలకూర.. 2 కట్టలు చింతకాయ.. ఒకటి చిలగడదుంపలు.. రెండు గుమ్మడికాయ.. చిన్న ముక్క ఉల్లిపాయలు.. రెండు అల్లంవెల్లుల్లి.. ఒక టీ. ధనియాలపొడి.. ఒక టీ. కారం.. ఒక టీ. ఉప్పు.. తగినంత గరంమసాలా.. చిటికెడు నూనె.. 3 టీ. పండుమిర్చి.. 2 శెనగపిండి.. 2 టీ. కొబ్బరి.. సగం చిప్ప
తయారీ విధానం : కూరగాయలన్నింటినీ ముక్కలుగా కోసి ఉప్పు నీళ్లలో వేసి ఉంచాలి. శెనగపిండిని వేయించి ఉంచాలి. కొబ్బరిని తురమాలి. ఓ బాణలిలో నూనె వేసి ముందుగా ఉల్లిముక్కలు వేసి ఎర్రగా వేయించాలి. అల్లంవెల్లుల్లి, కారం, ధనియాలపొడి వేసి కాస్త వేగాక కూరగాయల ముక్కలన్నీ వేసి కలపాలి. మూతపెట్టి ముక్కల్ని మగ్గనివ్వాలి.
ముక్కలన్నీ ఉడికిన తరువాత వేయించిన శెనగపిండి, తురిమిన కొబ్బరి వేసి కలపాలి. ఆపై సన్నగా తరిగిన పాలకూర, చింతకాయ, పండుమిర్చి ముక్కలు కూడా వేసి మరో పది నిమిషాలు ఉడికించి, ఉప్పు సరిచూసి దించేయాలి. ముక్కలు ఉడకడానికి అవసరమైతే కాసిన్ని నీళ్లు చిలకరించవచ్చు. అంతే మిలోనీ సబ్జీ సిద్ధమైనట్లే..!!