సేమియాతో పాయసం తయారు చేయడం అందరికీ తెలిసిందే. అయితే బియ్యం పిండితో పాయసాన్ని తయారు చేసినా చాలా రుచికరంగా ఉంటుంది. ఈ రుచికరమైన బియ్యంపిండి పాయసం తయారు చేయడం ఎలాగో తెలుసుకుందాం.
పాయసం తయారు చేయు విధానం : తడిబియ్యాన్ని ఆరబెట్టి తర్వాత సన్నటి నూకగా ఉండేలా దంచుకోవాలి. తర్వాత పాలు తీసుకుని పాత్రలో పోసి బాగా మరగనివ్వాలి. ఇప్పుడు బియ్యపు పొడిని, యాలకుల పొడిని వేసి బాగా మరగనివ్వాలి. అయితే పాయసం అడుగు మాడకుండా దాన్ని మధ్య, మధ్యలో కలియబెడుతుండాలి.
పాయసం బాగా చిక్కగా వచ్చాక పొయ్యి నుంచి దించేయాలి. కాసేపు తర్వాత కుంకుమపువ్వు చల్లి మళ్లీ పొయ్యిపై పెట్టాలి. ఇప్పుడు చక్కెర కూడా కలిపి కాసేపు సన్నని మంటపై ఉండనిచ్చి దించేయాలి. ఇలా తయారు చేసిన బియ్యం పాయసాన్ని కాస్త వేడిగా ఉన్నప్పుడే తినడం ప్రారంభిస్తే చాలా రుచిగా ఉంటుంది.