కావలసిన పదార్థాలు : బూడిదగుమ్మడి ముక్కలు... ఒక కప్పు కందిపప్పు... ఒక టీ. శెనగపప్పు... ఒక టీ. అల్లం... చిన్న ముక్క ధనియాలు... ఒక టీ. పచ్చిమిర్చి... ఆరు కొబ్బరితురుము... మూడు టీ. పసుపు... అర టీ. పెరుగు... రెండు కప్పులు ఆవాలు... ఒక టీ. మెంతులు... ఒక టీ. ఎండుమిర్చి... ఒకటి ఇంగువ... అర టీ. కరివేపాకు... నాలుగు రెమ్మలు నూనె... రెండు టీ. ఉప్పు... తగినంత
తయారీ విధానం : ముందుగా అరకప్పు నీళ్లలో కందిపప్పు, శెనగపప్పుల్ని గంటసేపు నానబెట్టాలి. అల్లం, జీలకర్ర, ధనియాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, నానబెట్టిన పప్పులు... అన్నీ కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని పెరుగులో కలపాలి. ఉప్పు, పసుపు కూడా వేసి బాగా కలిపి కాసేపు కదపకుండా పక్కన పెట్టాలి.
స్టవ్మీద బాణలి పెట్టి రెండు టీస్పూన్ల నూనె వేసి ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకులతో తాలింపు పెట్టిన తరువాత బూడిద గుమ్మడి ముక్కల్ని కూడా వేసి నీళ్లు పోసి మూతపెట్టి మంటను తగ్గించి ఉడికించాలి. ముక్కలు ఉడికాక పెరుగు మిశ్రమాన్ని వేసి బాగా కలిపి ఐదు నిమిషాలసేపు స్టవ్మీద ఉంచి దించేయాలి. అంతే మోర్కుళంబు రెడీ.