తీసుకోవలసిన పదార్ధాలు: అటుకులు - 35 గ్రా., జీడిపప్పు - 25 గ్రా., కుంకుమపువ్వు - ఐదు టీస్పూన్లు, చక్కెర - 200 గ్రా., యాలకలు - ఆరు, పచ్చకర్పూరం - నాలుగు టీస్పూన్లు, పాలు - 3/8 లీటర్లు.
ఇలా తయారు చేయండి: ముందుగా అటుకులను నెయ్యిలో వేయించి.. అరలీటరు నీళ్లను స్టౌమీద పెట్టి బాగా కాగనివ్వాలి. తర్వాత అందులో అటుకులను వేసి బాగా ఉడకనివ్వాలి. అనంతరం దానికి చక్కెర కలుపుకోవాలి.
కొద్ది సేపటి తర్వాత పాలు, మిగతా సామాన్లను కలుపుకుని కాసేపు ఉడకనిచ్చి దించివేస్తే.. అటుకుల పాయసం రెడీ.. ఇది చల్లారాకగాని.. లేక వేడిగాగాని బావుంటుంది.