కావలసిన పదార్థాలు : క్యాబేజీ... 50 గ్రా. నూనె... 100 గ్రా. ఎండుమిర్చి... 10 చింతపండు... నిమ్మకాయంత ఇంగువముక్క... చిన్నముక్క పోపులు, పసుపు... సరిపడా ఉప్పు... సరిపడా
తయారీ విధానం : కాస్తంత నూనెలో ఎండుమిర్చి వేయించి పక్కన పెట్టుకోవాలి. తరిగి ఉంచుకున్న క్యాబేజీని మరికాస్త నూనె వేసి వేయించాలి. అందులోనే చింతపండు రసం పోసి, పసుపువేసి బాగా కలియబెట్టి కాసిన్ని నీళ్ళు పోసి, మూతపెట్టి ఉడికించాలి. నీళ్ళన్నీ ఇగిరిపోయి క్యాబేజీ బాగా ఉడికిన తరువాత దాన్ని దించి చల్లారబెట్టాలి.
వేయించి పక్కన ఉంచుకున్న ఎండుమిర్చికి కొద్దిగా ఉప్పు కలిపి దంచాలి. అందులోనే ఉడికిన క్యాబేజీని కలిపి పచ్చడిలాగా రుబ్బుకోవాలి. చివరగా ఇంగువతో కలిపి పోపు పెట్టుకుని డబ్బాలో భద్రపరచుకోవాలి. అంతే క్యాబేజీ పచ్చడి రెడీ. కాయగూరల్లో శ్రేష్టమైన క్యాబేజీ.. పాంక్రియాటిక్ గ్రంథి క్యాన్సర్ ప్రభావాన్ని తగ్గించటంలో కీలకపాత్ర పోషిస్తుంది.