ఉల్లిపాయలను ముక్కలుగా తొరిగి పెట్టుకోవాలి. బంగాళా దుంపలను చెక్కుతీసి ముక్కలుగా చేసి నీటిలో నానబెట్టాలి. వంకాయలను కూడా ఒకటిన్నర అంగుళం పొడవు ముక్కలుగా తొరిగి పెట్టుకోవాలి. మిక్సీలో జీలకర్ర, ధనియాలపొడి, కారం, ఉప్పు, గరంమసాలా, కొబ్బరి తురుమువేసి మెత్తగా గుజ్జుచేసి ఉంచాలి. బాండీ పెట్టి నూనెపోసి కాగిన తర్వాత తయారుచేసిన గుజ్జువేసి దానికి బంగాళాదుంప, వంకాయ, ఉల్లి ముక్కలు, పచ్చి బఠానీ, వేసి ఒక నిమిషం వేపాలి. కాసేపు సన్నని మంటమీద ఉడికించాలి. ముక్కలు ఉడికిన తర్వాత కొత్తిమీర చల్లి దింపాలి. అన్నం విడిగా ఉడికించి పెద్ద గిన్నెలో పోసి, అందులో కూరను వేసి బాగా కలిపి మూత పెట్టి ఉంచాలి. పది నిమిషాల తర్వాత వేడివేడిగా వడ్డించాలి.