క్రిస్మస్ పండుగలో ప్రధానమైనది క్రిస్మస్ కేకు. దీన్ని తయారు చేసేందుకు అవసరమైన వివిధ రకాల ఫ్రూట్స్, వైన్ మిక్సింగ్ కార్యక్రమం నెల రోజులకు ముందుగానే జరుగుతుంది. ప్రస్తుతం చెన్నయ్లో ఉన్న జీఆర్టీ రాడిసన్ హోటల్లో క్రిస్మస్ కేక్ మిక్సింగ్ కార్యక్రమం శనివారం జరిగింది. హోటల్ చీఫ్ షెఫ్ విజయ్ కుమార్ నేతృత్వంలోని సహాయ షెఫ్లు, ఎగ్జిక్యూటివ్ సిబ్బంది, ప్రత్యేక ఆహ్వానితులు పాల్గొన్నారు.
క్రిస్మక్ కేక్ను తయారు చేసేందుకు అవసరమైన పలు రకాల ఫ్రూట్స్ మిక్స్ చేశారు. వీటిలో డ్రై ఫ్రూట్స్, ద్రాక్ష, ఖర్జూరాలు, టూటీ ఫ్రూటీ, పిస్తా, ఆల్మండ్, ఆరంజ్ తొక్కలు, డ్రై జింజర్, బ్లాక్ కరెంట్, వైన్, ఫూల్స్ అనే రకం ఫ్రూట్స్, డ్రై చెర్రీ ఇలా పలు రకాల పండ్లను మిక్సింగ్ చేశారు. క్రిస్మస్ పండుగకు ముందు ఈ మిశ్రమంతో వివిధ రకాల కేక్లను తయారు చేస్తారు.