ఇండోర్ వ్యాపారవేత్త రాజా రఘువంశీ హత్య జరిగిన మూడు వారాల తర్వాత, మేఘాలయ ప్రభుత్వం అన్ని హోమ్స్టేలు, రిసార్ట్లు, కుటుంబాలు తాము ఆతిథ్యం ఇచ్చే పర్యాటకుల వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలని ఆదేశించిందని అధికారులు బుధవారం తెలిపారు.
మేఘాలయ పర్యాటక శాఖ సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అన్ని హోమ్స్టేలు, రిసార్ట్లు మరియు ఇంటి యజమానులు కూడా తమ సందర్శకులందరినీ తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని, వారి అవసరమైన వివరాలను తీసుకోవాలని ఆదేశించిందని తెలిపారు.
ప్రభుత్వం అన్ని హోమ్స్టేలు, వసతి యూనిట్లు ఇప్పుడు పర్యాటకులు, సందర్శకులు, అతిథులను టూరిజం యాప్ ద్వారా తప్పనిసరిగా నమోదు చేసుకునేలా చూస్తుంది. దీనిని ఇప్పటికే 60 శాతం హోమ్స్టే యజమానులు. వసతి యూనిట్లు ఉపయోగిస్తున్నాయని తెలిపారు.
హోమ్స్టే, రిసార్ట్ యజమానులు పర్యాటకులు, అతిథుల వివరాలను నమోదు చేయకపోతే, దానిని చట్ట ఉల్లంఘనగా పరిగణిస్తామని వసతి యూనిట్ యజమానిపై బాధ్యత పడుతుందని అన్నారు.