కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి : పావుకిలో మైదా పిండి : 100 గ్రాములు బంగాళా దుంపలు : పావుకిలో ఉప్పు : తగినంత
తయారీ విధానం: ముందుగా బంగాళా దుంపలను ఉడికించి తొక్కతీసి మెత్తగా చేతితో నులిపి ముద్దగా చేసుకోవాలి. ఆ తరువాత బంగాళాదుంప ముద్దకు మైదా పిండి, గోధుమ పిండి కొంత నీరు చేర్చి చపాతీ పిండిలా కలుపుకోండి. ఉప్పును చేర్చడం మరువకండి సుమా. ఆ మిశ్రమాన్ని ఓ తడి బట్టతో కప్పి అర్థగంట పాటు అలా ఉంచండి.
ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న ముద్దలుగా చేసి పరాటా లాగా రుద్దుకోండి. వెంటనే పెనంపై కొంత నూనె రాసి చపాతీలుగా కాల్చండి. అంతే వేడి వేడి ఆలూ పరోటా రెడీ.