మాస్కోకు చేరుకున్న ఆంటోనీ: రక్షణ ఒప్పందాలే కీలకం!

మంగళవారం, 13 అక్టోబరు 2009 (19:40 IST)
మూడు రోజుల అధికారిక పర్యటన కోసం కేంద్ర రక్షణ శాఖామంత్రి ఏకే.ఆంటోనీ మంగళవారం రష్యా రాజధాని మాస్కోకు చేరుకున్నారు. ఆయన పర్యటనలో భారత్-రష్యా రక్షణ ఒప్పందాలే కీలక అజెండాగా మారనున్నాయి. ప్రధానంగా సరికొత్త కో వెంచర్ తదితర అంశాలపై చర్చిస్తారు. వీటితో పాటు.. రక్షణ ఒప్పందాల్లో పెట్టుబడులు, ఐదో తరం జనరేటర్ ఫైటర్స్‌ సాంకేతిక అంశాలు కీలకాంశాలుగా మారనున్నాయి.

ఈ పర్యటనలో మంత్రి ఆటోనీ రష్యా విదేశాంగ మంత్రి ఆంటోలీ సర్డేకోవ్‌తో ముఖాముఖిగా సమావేశమవుతారు. వీరిద్దరి మధ్య మిలిటరీ-టెక్నికల్ కో-ఆపరేషన్‌పై ఇండో-రష్యన్ ఇంటర్-గవర్నమెంటల్ కమిషన్, ప్రస్తుతం కొనసాగుతున్న మిలిటరీ టెక్నికల్ కోఆపరేషన్‌పై చర్చిస్తారు.

వీటితో పాటు.. గోర్ష్‌కోవ్ ఎయిర్‌క్రాఫ్ట్‌, అకులా-2 అణు జలంతర్గామి సరఫరాపై జరుగుతున్న జాప్యంపై కూడా మంతనాలు జరుపుతారు. గత రెండు సంవత్సరాలుగా పరిస్థితి ఏమాత్రం బాగలేదని అందువల్ల ఇండో-రష్యా ఒప్పందాల అమలుకు జాప్యం జరుగుతోందని రష్యా రక్షణ అధికారులు చెపుతున్న విషయం తెల్సిందే.

వెబ్దునియా పై చదవండి