అబాకస్ లెర్నింగ్ ఆఫ్ హయ్యర్ అర్థమెటిక్(ఏఎల్ఏహెచ్ఏ) ఇంటర్నేషనల్ సంస్థ ఆధ్వర్యంలో ఇండోనేషియలో ఈనెల 24న అంతర్జాతీయ గణిత పోటీ నిర్వహించింది. 18 దేశాలకు చెందిన 1,300 మంది విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు. భారత్ తరపున అహ్మదాబాద్లోని హేమచంద్రాచార్య సంస్కృత పాఠశాల విద్యార్థి తుషార్ తలావత్(14) కూడా పాల్గొన్నాడు.
గతేడాది అక్టోబరులో గుజరాత్లో నిర్వహించిన పోటీలో 70 ప్రశ్నలకు కేవలం మూడు నిమిషాల్లో సమాధానం చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ పోటీలో తుషార్ 5,300 మందిని ఓడించాడు. చెన్నైలో గత డిసెంబరులో జరిగిన జాతీయస్థాయి పోటీలో 4,300 మందిని ఓడించి విజేతగా నిలిచాడు.