ముస్లింలపై అమెరికా తదుపరి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఉగ్రవాద ప్రభావిత దేశాల నుంచి వచ్చే యాత్రికులను నిరోధించేందుకు 2001 సెప్టెంబర్ 11 దాడుల తర్వాత అమెరికా నేషనల్ సెక్యూరిటీ ఎంట్రీ - ఎక్సిట్ రిజిస్ట్రేషన్ సిస్టం(ఎన్ఎస్ఈఈఆర్ఎస్)ను అమెరికా అమల్లోకి తెచ్చింది.
ఇప్పటికే ఎన్ఎస్ఈఈఆర్ఎస్ కింద మొదట ఇరాక్, ఇరాన్, లిబియా, సుడాన్, సిరియాలకు చెందిన వారిపై ఆంక్షలు విధించగా.. తర్వాత ఆఫ్రికా, మధ్య ఆసియాల్లోని మరో 25 దేశాలపై ఆంక్షలు తీసుకొచ్చారు. అయితే ప్రస్తుత రద్దుతో ఆంక్షలు తొలగిపోనున్నాయి.