మృతదేహాలను సేకరించి.. మాంసాన్ని ముక్కలు చేసి అమ్మేస్తున్న చైనా వ్యాపారులు!

శుక్రవారం, 20 మే 2016 (17:20 IST)
చైనాలో దారుణం వెలుగు చూసింది. మృతదేహాలను సేకరించి.. మాంసాన్ని ముక్కలు ముక్కలుగా చేసి విక్రయిస్తున్నట్టు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం సాగుతోంది. ఈ మాంసాన్ని ఆఫ్రికా దేశమైన జాంబియాకు విక్రయిస్తున్నట్టు సమాచారం. ఈ మాట వింటుంటూనే ఎంతటివారైనా గజగజ వణికిపోవాల్సిందే. ఇంతకీ ఈ వివరాలను పరిశీలిద్ధాం.
 
జాంబియాకు చెందిన ఓ మహిళ చైనాలో నివసిస్తుంది. ఆ మహిళ ఆఫ్రికాలోని తన బంధువులకు ఈ మాంసాన్ని తినొద్దంటూ సోషల్ మీడియాలో హెచ్చరించింది. మృతదేహాలను సేకరించి, వాటిని ముక్కలుగా చేసి విక్రయిస్తున్నారని తన పోస్ట్‌లో పేర్కొంది. 
 
అయితే ఈ విషయంపై జాంబియాకు చెందిన ఉన్నతాధికారి స్పందించారు. చైనా నుంచి మానవ మాంసాన్ని దిగుమతి చేసుకుంటున్నట్లు వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని ఆయన కొట్టిపారేశారు. చైనా విదేశాంగ అధికారి యాంగ్ యౌమింగ్ కూడా ఈ వార్తలను ఖండించారు. సోషల్ మీడియాలో సాగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని తెలిపారు. ఇది ఓ స్థానిక పత్రిక సృష్టించిన పుకారుగా ఆయన పేర్కొన్నారు. 

వెబ్దునియా పై చదవండి