జాంబియాకు చెందిన ఓ మహిళ చైనాలో నివసిస్తుంది. ఆ మహిళ ఆఫ్రికాలోని తన బంధువులకు ఈ మాంసాన్ని తినొద్దంటూ సోషల్ మీడియాలో హెచ్చరించింది. మృతదేహాలను సేకరించి, వాటిని ముక్కలుగా చేసి విక్రయిస్తున్నారని తన పోస్ట్లో పేర్కొంది.
అయితే ఈ విషయంపై జాంబియాకు చెందిన ఉన్నతాధికారి స్పందించారు. చైనా నుంచి మానవ మాంసాన్ని దిగుమతి చేసుకుంటున్నట్లు వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని ఆయన కొట్టిపారేశారు. చైనా విదేశాంగ అధికారి యాంగ్ యౌమింగ్ కూడా ఈ వార్తలను ఖండించారు. సోషల్ మీడియాలో సాగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని తెలిపారు. ఇది ఓ స్థానిక పత్రిక సృష్టించిన పుకారుగా ఆయన పేర్కొన్నారు.