బిపర్‌జోయ్ తుపాను.. పాకిస్తాన్ అప్రమత్తం.. 17,18 నాటికి తగ్గుముఖం

మంగళవారం, 13 జూన్ 2023 (09:35 IST)
గుజరాత్- పాకిస్థాన్ మధ్య అతి తీవ్రంగా మారిన బిపర్‌జోయ్ తుపాను తీరాన్ని దాటనున్న నేపథ్యంలో పాకిస్థాన్ అప్రమత్తమైంది. అరేబియా సముద్ర తీరంలోని అన్ని ప్రాంతాల అధికారులను అప్రమత్తం చేసింది. ప్రభావిత ప్రాంతాల్లోని దాదాపు 80వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు.
 
15న సింధు తీరాన్ని తాకనున్న తుపాను తీవ్రత 17,18 నాటికి తగ్గుముఖం పట్టనుంది. తుపాను కారణంగా గంటకు 160-180 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచ్చే అవకాశం ఉందని పాకిస్థాన్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. సముద్రంలో అలలు 35 నుంచి 40 అడుగుల మేర ఎగసిపడే అవకాశం ఉందని తెలిపింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు