ఫ్లయింగ్ ట్యాంక్‌లు.. జూలైలో భారత్‌కు 3 అపాచీ హెలికాఫ్టర్లు

సెల్వి

శుక్రవారం, 4 జులై 2025 (16:53 IST)
Apache Helicopters
'ఫ్లయింగ్ ట్యాంక్‌లు' అని పిలువబడే అపాచీ హెలికాప్టర్లను కొనుగోలు చేసే ఒప్పందంపై భారతదేశం - అమెరికా మధ్య ఫిబ్రవరి 2020లో సంతకం చేయడం జరిగింది. ఈ క్రమంలో కొనుగోలు చేసిన ఆరు అపాచీ హెలికాప్టర్లలో, జూలైలో మూడు సైన్యానికి అందుతాయి.
 
మొదటి మూడు బోయింగ్ అపాచీ హెలికాప్టర్లు జూలై 15 నాటికి భారతదేశానికి చేరుకుంటాయని భావిస్తున్నారు. మిగిలిన మూడు నవంబర్ నాటికి పంపబడతాయని భావిస్తున్నారు. మంగళవారం అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సేత్ మరియు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మధ్య జరిగిన టెలిఫోన్ సంభాషణ సందర్భంగా, ఈ సంవత్సరం ఆరు హెలికాప్టర్లు డెలివరీ అవుతాయని హామీ ఇచ్చారు. 
 
ఆరు హెలికాప్టర్లు భారత వైమానిక దళం వద్ద ఉన్న 22 అపాచీ హెలికాప్టర్ల సముదాయానికి అదనంగా చేరుతాయి. 2015 సెప్టెంబర్‌లో అమెరికాతో కుదిరిన రూ.13,952 కోట్ల ఒప్పందం ద్వారా 22 హెలికాప్టర్లను కొనుగోలు చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు