ఎట్టకేలకు రెండేళ్ల తర్వాత డోనాల్డ్ ట్రంప్‌పై ట్విట్టర్ నిషేధం ఎత్తివేత!

గురువారం, 26 జనవరి 2023 (12:17 IST)
అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ విధించిన నిషేధాన్ని ఎట్టికేలకు ఎత్తివేసింది. గత రెండేళ్లుగా ట్రంప్ ట్విట్టర్, ఫేస్‌బుక్ ఖాతాలపై నిషేధం కొనసాగుతున్న విషయం తెల్సిందే. 2021లో అమెరికా క్యాపిటల్ భవనంపై జరిగిన దాడి తర్వాత ఆయన సామాజిక ఖాతాలపై నిషేధం విధించారు. 
 
ఇపుడు అంటే రెండేళ్ల తర్వాత ఆ నిషేధం ఎత్తివేసి, తిరిగి ట్రంప్ ఖాతాలను పునరుద్ధరించారు. ఈ విషయాన్ని ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ల మాతృసంస్థ మెటా ప్రకటించింది. ప్రజలు ఇకపై తమ రాజకీయ నాయకులు ఏం చెబుతున్నారో వివరించవచ్చు. అది మంచైనా.. చెడైనా.. అంటా బ్లాగ్ స్పాట్ వేదిక వెల్లడించింది. 
 
కాగా, 2021లో అమెరికా అధ్యక్ష పీఠానికి జరిగిన ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ ఓటమి పాలయ్యారు. దీన్ని జీర్ణించుకోలేని ఆయన తన అనుచరులను హింసాకాండకు ప్రేరేపించినట్టు అభియోగాలు ఉన్నాయి. ముఖ్యంగా, అమెరికాకు గుండెకాయలాంటి క్యాపిటల్ భవనంపై ట్రంప్ అనుచరులు దాడి చేశారు. తన అనుచరులను రెచ్చగొట్టేలా ట్వీట్లు చేశారు. దీంతో ఆయన సోషల్ మీడియా ఖాతాలపై మెటా నిషేధం విధించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు