సరిహద్దు వెంట ఓ చిన్నపాటి విలేజ్‌ ఏర్పాటు

శుక్రవారం, 5 నవంబరు 2021 (19:12 IST)
సరిహద్దు వివాదాలు కొనసాగుతున్న వేళ కంత్రీ డ్రాగన్ మరోసారి తన చర్యలతో భారత్‌ను రెచ్చగొడుతోంది. అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు వెంట భారత భూభాగంలో ఏకంగా ఓ చిన్నపాటి విలేజ్‌నే నిర్మించేసింది. 
 
మన భూభాగంలోకి 4.5 కిలోమీటర్ల మేర చొచ్చుకొచ్చినట్లు శాటిలైట్ ఇమేజ్‌లు స్పష్టం చేస్తున్నాయి. డ్రాగన్ సృష్టించిన గ్రామంలో 101 ఇళ్లను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.ఇదే తరహాలో మరికొంత దూరంలో మరో గ్రామాన్ని నిర్మించింది.

అయితే, ఈ గ్రామాన్ని ఏర్పాటు చేసిన ప్రాంతం భౌగిళికంగా భారత భూభాగంలో ఉన్నప్పటికీ 1959 నుంచి చైనా ఆధీనంలో ఉంది. గతంలో అక్కడ చైనా ఆర్మీ మాత్రమే ఉండగా తాజాగా గ్రామన్ని ఏర్పాటు చేయడం కలకలం రేపుతోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు