యూరీ ఉగ్రదాడికి నిరసనగా భారత ఆర్మీ పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్ర తండాలపై సర్జికల్ స్ట్రైక్ జరిపి భారీ సంఖ్యలో తీవ్రవాదులను మట్టుబెట్టిన విషయంతెల్సిందే. ఈ దాడులు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. అంతేనా పాకిస్థాన్తో పాటు ఉగ్ర సంస్థలు రగిలిపోయాయి. ఈ దాడులకు ప్రతీకారం తీర్చుకోవాలని వివిధ రకాల ప్లానులు వేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో హఫీజ్ సయీద్ ఓ ప్రకటన చేశారు. పాకిస్థాన్లో భారత్ జరిపిన లక్షిత దాడులకు నిరసనగా తాము కూడా సర్జికల్ స్ట్రైక్స్ చేశామన్నారు. ఈ దాడిలో 30 మంది భారత సైనికులు మృతిచెందారన్నారు. ఈ మేరకు ఒక ఆడియో టేప్ని విడుదల చేశాడు. అయితే అటువంటివి ఏం జరగలేదని, సైనికులు ఎవరూ మృతిచెందలేదని, ముగ్గురు కార్మికులు మాత్రమే మృతిచెందారని భారత సైన్యం స్పష్టం చేసింది.