ఉత్తర కొరియా కిమ్ జోంగ్ ఉన్ దూకుడును మరింత పెంచారు. ఎవరి మాట వినకుండా.. ప్రపంచ దేశాలను అణు పరీక్షలతో వణికిస్తున్నారు. ఇప్పటికే కిమ్ జోంగ్ అణు పరీక్షలతో అగ్రరాజ్యం అమెరికానే జడుసుకుంటోంది. ఈ నేపథ్యంలో కిమ్ జోంగ్ మరోసారి క్షిపణి ప్రయోగం చేశారు. సోమవారం ఉత్తర కొరియా పరీక్షించిన స్వల్పశ్రేణి బాలిస్టిక్ క్షిపణి... 450 కిలోమీటర్లు ప్రయాణించి సరిగ్గా జపాన్ సముద్ర జలాల్లో పడింది. గత మూడు వారాల్లో ఉత్తర కొరియా మూడోసారి క్షిపణి పరీక్షలు నిర్వహించింది.
ఉత్తరకొరియాను నిలువరించేందుకు తాము అమెరికాతో కలిసి పనిచేస్తామని ప్రకటించారు. దీంతో జపాన్ మద్దతు లభించిన ఆనందంలో అమెరికా చీఫ్ డొనాల్డ్ ట్రంప్ పండుగ చేసుకుంటున్నారు. ఛాన్స్ దొరికితే చాలు ఉత్తరకొరియా ఆట కట్టేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్న ట్రంప్.. ఇక జపాన్ మద్దతు లభించడంతో కిమ్పై దూకుడు పెంచే ఛాన్సుందని తెలుస్తోంది.