అక్కడ వైద్యుల సమాచారం మేరకు ఇటీవలే ఎబోలా వ్యాధిగ్రస్తులకు చికిత్స అందించేందుకు జెనివా వెళ్లిన వైద్యునికి ఈ వ్యాధి సోకినట్లు తెలిసిందన్నారు. దీంతో ఆ దేశ ప్రజలు హడలి పోతున్నారు. ఎంతో మెరుగైన ఆరోగ్య వ్యవస్థ ఉన్న అగ్రరాజ్యంలోనే ఈ మహమ్మారి విస్తరిస్తే.. భారత్ వంటి దేశాల్లో అది భారీ స్థాయిలో విరుచుకుపడే అవకాశం లేకపోలేదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.