ఇక నో క్వారెంటైన్, దర్జాగా వచ్చేయండి సౌదీ అరేబియా

మంగళవారం, 24 ఆగస్టు 2021 (20:40 IST)
సౌదీ అరేబియా తీపి కబురు చెప్పింది. భారతదేశంలో వుండి సౌదీకి ఎప్పుడు తిరిగి వెళ్లాలా అని ఎదురుచూస్తున్నవారికి ఉపశమనం కలిగించే ప్రకటన చేసింది. రెండు డోసుల టీకాలు తీసుకున్నవారు ఇకపై క్వారెంటైన్లో వుండక్కర్లేదనీ, నేరుగా వచ్చేయవచ్చని తెలిపింది. ఐతే ఆ రెండు డోసులు సౌదీలో తీసుకున్నవారికి మాత్రమే వర్తిస్తుందని వెల్లడించింది.
 

Saudi Arabia authorities have announced that Indian nationals who have travelled to India after receiving both doses of vaccine in Saudi Arabia will be able to return to the Kingdom directly without need for quarantine in a third country: Indian Embassy in Saudi Arabia pic.twitter.com/A5ti7TMBHP

— ANI (@ANI) August 24, 2021
సౌదీ అరేబియాలో రెండు డోసుల వ్యాక్సిన్ అందుకున్నవారు ఇక ఎంతమాత్రం ఆలోచించకుండా హ్యాపీగా సౌదీ విమానం ఎక్కేయవచ్చు. ఈ విషయాన్ని సౌదీ అరేబియాలోని భారత రాయబార కార్యాలయం ధృవీకరించింది. ఐతే భారతదేశంలో డోసులు తీసుకున్నవారి సంగతి గురించి మరికాస్త వెయిట్ చేయాల్సి వున్నట్లే కనబడుతోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు