ఉత్తర కొరియాలో బాహుబలి క్షిపణి... సైనిక పరేడ్‌లో ప్రదర్శన

ఆదివారం, 11 అక్టోబరు 2020 (16:44 IST)
ఉత్తర కొరియా రక్షణశాఖ బాహుబలి క్షిపణిని తయారు చేసింది. దీన్ని శనివారం జరిగిన సైనిక పరేడ్‌లో ప్రదర్శించింది. ఆ దేశ అధికార వర్కర్స్ పార్టీ 75వ వ్యవస్థాపక దినోత్సవం శనివారం ఘనంగా జరిగింది. ఈ వేడుకలకు దేశాధినేత కిమ్ జాంగ్ ఉన్ హాజరయ్యారు. 
 
ఈ సందర్భంగా నిర్వహించిన సైనిక పెరేడ్ లో భారీ క్షిపణిని ప్రదర్శించారు. ఇది ఖండాంతర అణుక్షిపణిగా భావిస్తున్నారు. దీని సైజు దృష్ట్యా అంతర్జాతీయ మీడియాలో రాక్షస క్షిపణి అని అభివర్ణిస్తున్నారు. 
 
కాగా ఓ పెరెడ్‌లో బహిరంగంగా ప్రదర్శించిన మిస్సైళ్లలో ఇదే అతిపెద్దది అని అమెరికా శాస్త్రవేత్తల సమాఖ్య పేర్కొంది. ఈ బాహుబలి క్షిపణికి అమెరికా రక్షణ వ్యవస్థల నుంచి తప్పించుకునే సామర్థ్యం ఉన్నట్టు తెలుస్తోంది.
 
కాగా, ఈ సైనిక ప్రదర్శనకు ఉత్తర కొరియా సైనికులు పెద్ద సంఖ్యలో హాజరు కాగా, అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్న కూడా పెరేడ్‌లో పాల్గొన్నట్టు అక్కడి అధికారిక మీడియా ఓ వీడియో విడుదల చేసింది. భారీ మిస్సైల్ వాహనం వెళుతుండగా కిమ్ జాంగ్ ఉన్ అభివాదం చేస్తుండడాన్ని ఈ వీడియోలో చూడొచ్చు.

 

North Korea's Brand New ICBMpic.twitter.com/WwYRGH7dwG

— Defence Decode (@DefenceDecode) October 10, 2020

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు