ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ చేపట్టిన సైనిక చర్య వల్ల పాకిస్థాన్లో ఆస్తి, ప్రాణనష్టం భారీగా వాటిల్లింది. అయితే, తమకు ఎలాంటి హాని జరగలేదంటూ బుకాయించి, భారత్తో జరిగిన యుద్ధంలో తాము విజయం సాధించినట్టు పాకిస్థాన్ ప్రధాని షెహ్బాజ్ షరీఫ్ జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో వెల్లడించారు. అయితే, రోజులు గడిచేకొద్దీ తమకు జరిగిన నష్టాన్ని తాజాగా వెల్లడించింది.
ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ చేపట్టిన సైనిక చర్యలో తమ దేశ సైనికులు ప్రాణాలు కోల్పోయినట్టు పాకిస్థాన్ పాలకులు తాజాగా వెల్లడించారు. ఈ ఆపరేషన్ ద్వారా 11 మంది సైనికులు చనిపోయినట్టు తాజాగా పేర్కొన్నారు. మృతుల్లో ఆరుగురు పాక్ ఆర్మీకి చెందిన వారుకాగా, ఐదుగురు వైమానికి దళానికి చెందిన వారని తెలిపారు. మరో 78 మంది గాయపడినట్టు పేర్కొంది.
అలాగే, వైమానిక దళానికి చెందిన స్క్వాడ్రన్ లీడర్ ఉస్మాన్ యూసుఫ్, చీఫ్ టెక్నీషియన్ ఔరంగజేబ్, సీనియర్ టెక్నీషియన్ నజీబ్, కార్పోరల్ టెక్నీషియన్ ఫరూఖ్, సీనియర్ టెక్నీషియన్ ముబాషిర్ ప్రాణాలు కోల్పోయినట్టు పేర్కొంది.
అయితే, తమ దాడిలో 35 నుంచి 40 మంది పాక్ సౌనికులు మృతి చెంది ఉంటారని భారత్ ఇటీవల ప్రకటించిన విషయం తెల్సిందే. అలాగే, 100 మందికిపైగా ఉగ్రవాదులు హతమైనట్టు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ ఆపరేషన్ సిందూర్ వల్ల తమకు జరిగిన నష్టాన్ని తాజాగా వెల్లడించింది.