భారత్పై ఏ క్షణమైనా దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ చెప్పుకొచ్చారు. యురి దాడి ఘటనతో భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయంతెల్సిందే. దీనిపై ముషారఫ్ స్పందిస్తూ.. కాశ్మీర్లో ఏ దాడి జరిగినా పాకిస్థాన్ను నిందించడం భారత్కు అలవాటైపోయిందని మండిపడ్డారు.
యూరీ సెక్టార్లో సైన్యంపై జరిగిన దాడికి ప్రతీకారం తీర్చుకునేందుకు ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రతీకారం తీర్చుకోవాలో తమకు బాగా తెలుసని ఇండియన్ ఆర్మీ తెలిపిన నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ, ఎప్పుడంటే అప్పుడు ఎంపిక చేసుకున్న ప్రాంతంలో తాము భారత్ పై దాడులు చేయగలమని హెచ్చరించారు.
మీకు నచ్చిన చోటు ఎంచుకుని మీరు దాడి చేస్తే... మాకు నచ్చిన చోటు ఎంచుకుని మేము దాడి చేస్తామని ఆయన వార్నింగ్ ఇచ్చారు. దాడి జరిగిన గంటల్లోనే ఈ దాడి పాక్ ఉగ్రవాదులే జరిపారని అనేందుకు సాక్ష్యాలు ఏంటని ప్రశ్నించారు. ఆయుధాలు, దుస్తులు, ఇతర సామగ్రి పాకిస్థాన్కు చెందినవన్న సాక్ష్యాలు ఉన్నాయి కదా? అని ప్రశ్నించారు.