#టాంజానియా చర్చిలో తొక్కిసలాట-20 మంది మృతి.. ఫాదర్ అరెస్ట్

సోమవారం, 3 ఫిబ్రవరి 2020 (12:16 IST)
టాంజానియాలోని ఓ చర్చిలో జరిగిన తొక్కిసలాటలో 20మంది ప్రాణాలు కోల్పోయారు. తాను దేవుడి దూతనని, రోగాలను నయం చేసే నూనె తన దగ్గర వుందని మోషి టౌన్ లోని ఎవాంజెలికల్ క్రిస్టియన్ చర్చిలో ప్రముఖ మత బోధకుడు బోనిఫేస్ వాంపోసా తెలిపారు. ఈ నూనెను అక్కడికి వచ్చిన భక్తులపై చల్లడంతో ప్రేయర్‌లో ఉన్నట్టుండి ఒక్కసారిగా భక్తుల రద్దీ కారణంగా తొక్కిసలాట చోటుచేసుకుంది.
 
ఇలా భక్తులు ఆ నూనెను చల్లుతుంటే ఆ పవిత్రమైన నూనె తమపై పడాలని అంతా ఒక్కసారిగా దూసుకొచ్చారు. దీంతో తొక్కిసలాట జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఈ ఘటన జరిగిన వెంటనే మతబోధకుడు అక్కడి నుంచి పరారైనట్లు తెలిపారు. మోషిలో 20 మంది చనిపోయిన ఘటనపై టాంజానియా ప్రెసిడెంట్ మగుఫులి సంతాపం ప్రకటించారు. ఈ ఘటనకు బాధ్యుడైన మతబోధకుడికి పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు తెలిపారు. 
 
ఇంకా పోలీసులు మాట్లాడుతూ.. ఫాస్టర్లు చాలామంది దీర్ఘకాలిక వ్యాధులను నయం చేస్తామని, దారిద్ర్యాన్ని పారద్రోలు తామని ఆఫ్రికా దేశాల్లో కొన్నేళ్లుగా జనాలను మోసం చేస్తున్నారని చెప్పారు. ఇలా ఆర్థిక కుంభకోణాలు, మనీ లాండరింగ్ పథకాలు జరుగుతున్నాయని తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు