అనుభవించి పొత్తికడుపులో ఓ పంచ్.. ఆపై గొంతు నులిమి హత్య... అమెరికాలో సీరియల్ కిల్లర్

శుక్రవారం, 30 నవంబరు 2018 (16:19 IST)
అతనో సీరియల్ కిల్లర్. అమెరికాలో వివిధ రాష్ట్రాల్లో ఏకంగా 90 మందిని అనుభవించి హత్య చేశాడు. నైట్ క్లబ్బులు, పబ్బులు, బార్లలో ఒంటరిగా కనిపించే మహిళలను శ్యామ్యూల్ డ్రగ్స్ పేరుతో ట్రాప్ చేసి నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకెళ్లి శారీరకంగా కలిసి ఆ తర్వాత అక్కడే గొంతు నులిమి హత్య చేస్తుంటాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ప్రస్తుతం టెక్సాస్ జైలులో 78 యేళ్ళ వృద్ధుడు శిక్షను అనుభవిస్తున్నాడు. ఈయన 1980-84 మధ్య కాలంలో ముగ్గురు మహిళల అత్యాచారం, హత్య కేసుల్లో అరెస్టు చేశారు. ఆ తర్వాత పోలీసులు మరింతగా లోతుగా ఆయన వద్ద విచారణ జరుపగా అతనిలో ఓ నరరూప రాక్షసుడున్నాడన్న విషయం బయటపడింది. దీంతో దర్యాప్తు అధికారులే నివ్వెర పోయారు. 
 
పైగా, ఇతను ఓ బాక్సర్. మత్తుమంది ఇచ్చి అనుభవిస్తాడు. ఆ తర్వాత హత్య చేసేందుకు ముందు వారిపై ముష్టిఘాతాలు కురిపిస్తాడు. 1982లో 20 యేళ్ళ యువతిని చంపడానికి ముందు పొత్తికడుపులో ఇచ్చిన ఓ పంచ్‌కు ఆ యువతి వెన్నుపూక విరిగిపోయింది. ఈ నరరూపరాక్షసుడి హత్యాకాండ 1980 నుంచి 1990 వరకు కొనసాగింది. దేవుడు, పాపం, శిక్షలు అంటే భయం లేకపోవడంతో శ్యామ్యూల్ లిటిల్ ఈ తరహా నేరాలకు పాల్పడినట్టు అధికారుల విచారణలో తేలింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు