సోమాలియాలో హోటల్‌పై ఆత్మహుతి దాడి.. 32 మంది మృతి

సెల్వి

శనివారం, 3 ఆగస్టు 2024 (17:03 IST)
సోమాలియా దేశంలోని ఓ హోటల్‍పై ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో దాదాపు 32 మంది వరకు ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. అలాగే పోలీసులు జరిపిన కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడింది తామేనంటూ అల్ ఖైదా ఉగ్ర సంస్థకు చెందిన అనుబంధ విభాగం అల్ షబాబ్ ప్రకటించింది. 
 
ఆఫ్రికా ఖండంలో అత్యంత పేద, కల్లోలభరిత దేశంగా గుర్తింపు పొందిన సోమాలియాలో ఉగ్రవాదులు పెట్రేగిపోతున్నారు. తాజాగా ఓ హోటల్‌పై ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో 32 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 63 మందికి గాయాలయ్యాయి. ఈ ఉగ్రదాడికి తామే బాధ్యలమంటూ అల్ షబాబ్ ప్రకటించింది. 
 
సోమాలియా రాజధాని మొగదిషు నగరంలోని లిడో బిచ్‌కు సమీపంలో ఉన్న ఈ హోటల్‌పై ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఓ ఆత్మాహుతి దళ సభ్యుడు వంటినిడా పేలుడు పదార్థాలు అమర్చుకుని తనను తాను పేల్చుకున్నాడు. భద్రతా బలగాలు స్పందించి కాల్పులు జరపడంతో నలుగురు సాయుధ ఉగ్రవాదులు మరణించారు. మరో ఉగ్రవాదిని సజీవంగా పట్టుకున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు