కోవిడ్ నిబంధనలు గాలికి.. వజ్రాల కోసం వేట... ఎక్కడ?

సోమవారం, 21 జూన్ 2021 (16:10 IST)
కరోనా కష్టకాల్లో తమను ఆర్థికంగా ఆదుకునేందుకు ఏ చిన్న అవకాశం అందుబాటులోకి వచ్చినా దాన్ని ఏ ఒక్కరూ వదులుకునేందుకు ఇష్టపడటం లేదు. అలాంటి వారిలో సౌతాఫ్రికా వాసులు కూడా ఉన్నారు. ఈ దేశంలోని ఓ వర్గ ప్రజలు వజ్రాల కోసం తవ్వకాలు సాగిస్తున్నారు. 
 
కరోనా కల్లోలంతో తీవ్ర ఆర్థిక సంక్షోభంలో మునిగిపోయిన సౌతాఫ్రికాను మరో సమస్య వేధిస్తుంది. సౌతాఫ్రికాలోని ఓ చిన్న కుగ్రామంలో వేల మంది కోవిడ్ నిబంధనలు అతిక్రమించి గుంపులు గుంపులుగా తిరుగుతున్నారు. ఆ గ్రామంలో విలువైన వజ్రాలు దొరుకుంతడడమే అందుకు కారణం. 
 
అయితే, ఈ తవ్వకాల్ని కట్టడి చేయడంలో స్థానిక యంత్రాంగం పూర్తిగా చేతులెత్తేసింది. ఇంతమంది ఒకేసారి గుమిగూడడంతో కోవిడ్ విజృంభించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తోంది. 
 
మరోవైపు కోవిడ్ ఎఫెక్ట్‌తో దక్షణాఫ్రికా ఆర్థిక వ్యవస్థ దారుణంగా పతనమైంది. లక్షల మంది ప్రజలు పేదరికంలో కూరుకుపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో తమ తలరాతను మార్చుకునేందుకు వజ్రాల వేటను ముమ్మరం చేస్తున్నారు. అయితే, వారం రోజుల నుంచి తవ్వకాల్లో దొరుకుతున్నవి వజ్రాలేనా అనేది తేల్చడంలో జియాలజిస్టులు నిమగ్నమైవున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు