ఎయిడ్స్‌ను జయించిన వ్యక్తి... మహమ్మారిపై మొదటి గెలుపు

బుధవారం, 14 సెప్టెంబరు 2016 (12:32 IST)
ప్రాణాంతక సుఖవ్యాధి ఎయిడ్స్‌పై ఓ వ్యక్తి విజయం సాధించాడు. ప్రపంచంలో ప్రాణాంతక మహమ్మారిపై తొలి గెలుపు ఇదే కావడం గమనార్హం. హెచ్ఐవీ పాజిటివ్ వచ్చిన వ్యక్తికి ఏళ్ల తరబడి చికిత్స జరిపి శరీరం నుంచి వైరస్‌ను పూర్తిగా పారద్రోలారు జర్మనీ వైద్యులు ప్రకటించారు. తద్వారా ఈ మహమ్మారిపై పోరాడుతున్న లక్షలాది మందిలో కొత్త ఆశలు చిగురించేలా చేశారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే... 1966లో జన్మించిన రాయ్ బ్రౌన్‌కు 1995లో ఎయిడ్స్ సోకినట్టు వెల్లడైంది. ఆపై చికిత్స కోసం బెర్లిన్ కు వెళ్లాడు. తనపైనే పరిశోధనలు చేయాలని డాక్టర్లను కోరాడు. 2007 నుంచి 'స్టెమ్ సెల్ ప్లాంటేషన్' అనే చికిత్సా పద్ధతి ద్వారా వైద్యులు, అతనిలోనీ సీడీ4 కౌంట్‌ను పెంచేలా చర్యలు తీసుకున్నారు. దీంతో అతని రోగనిరోధక శక్తి పెరుగుతూ వచ్చింది.
 
ఇదేసమయంలో రిట్రో వైరల్ థెరపీని చేస్తూ, కొన్ని సంవత్సరాలుగా రాయ్ బ్రౌన్‌కు చికిత్స చేస్తూ వచ్చారు. ఇప్పుడు అతను హెచ్ఐవీ నెగటివ్. అతని శరీరంలో ఎక్కడా వైరస్ ఆనవాళ్లు లేవని, ఎయిడ్స్ నుంచి రాయ్ సురక్షితంగా బయటపడ్డాడని వైద్యులు వెల్లడించారు. హెచ్ఐవీకి విరుగుడు కనిపెట్టేందుకు నేటి వైద్య శాస్త్రం దశాబ్దాలుగా పడుతున్న కష్టానికి రాయ్ బ్రౌన్ కథ కొత్త ఉత్సాహాన్ని ఇవ్వగా, ఆత్మ విశ్వాసం ఉంటే దేన్నైనా జయించవచ్చని నిరూపించాడితను.

వెబ్దునియా పై చదవండి