భారత్ సర్జికల్ స్ట్రైక్స్లో మృతి చెందిన సుమారు 40 నుంచి 70 మంది ఉగ్రవాదుల మృతదేహాలను శుక్రవారం పాక్ ఆర్మీ రహస్యంగా ఖననం చేసిందని నిఘా వర్గాలు తెలిపాయి. ఇక మృతి చెందిన ఉగ్రవాదుల్లో జైషే-ఇ-మహ్మద్, లష్కర్-ఎ-తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్కు చెందిన వారని నిఘా వర్గాలు తెలిపాయి.
ఇదిలా ఉంటే.. సర్జికల్ స్ట్రైక్ దాడులతో భారత్-పాకిస్థాన్ల మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఉరీ దాడుల నేపథ్యంలో ఏ సమయంలోనైనా యుద్ధాన్ని ప్రకటించే అవకాశం ఉండటంతో ఇండియా యుద్ధ సామాగ్రిని సరిహద్దు ప్రాంతాలకు తరలిస్తున్నట్లు సమాచారం. మన దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ఆర్మీ యుద్ధ సామాగ్రిని కీలక ప్రాంతాలకు తరలిస్తున్నారు.