వీసా మోసం కేసులో దోషులుగా ముగ్గురు భారతీయులు...

గురువారం, 4 ఏప్రియల్ 2019 (10:31 IST)
అమెరికాలో హెచ్1బీ వీసాల మోసం కేసులో ముగ్గురు భారతీయులకు జైలుశిక్షకు గురయ్యారు. ఈ సంఘటన అమెరికాలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, శాంతా క్లారాలో నివిసించే కిషోర్ ద‌త్త‌పురం, టెక్సాస్‌లో నివసించే కుమార్ అశ్వ‌ప‌తి, శాన్ జోస్‌కు చెందిన సంతోష్ గిరిలు నానోసిమాంటిక్స్ కంపెనీ పేరుతో ఓ క‌న్స‌ల్టెన్సీ నడిపిస్తున్నారు.
 
వ‌ర్క‌ర్ల కోసం నకిలీ హెచ్‌-1బీ వీసాల‌ను వీళ్లు జారీ చేశారు. ఉద్యోగాలు లేని వాళ్లకు కూడా వీళ్లు వీసాల‌ను ఇచ్చారు. అయితే వీసా దరఖాస్తులో భాగంగా ఐ-129 అనే పిటిషన్‌‌ను అమెరికా పౌరసత్వ, ఇమ్మిగ్రేషన్‌ విభాగానికి సమర్పించాల్సి ఉంటుంది. అందులో అభ్యర్థి చేయబోయే ఉద్యోగానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేయాలి.
 
అయితే ఈ ముగ్గురు భారతీయులులేని ఉద్యోగాల్ని ఉన్నట్లుగా చూపించి లాభం పొందాలని చూశారని అక్కడి పోలీసులు కోర్టుకు సమర్పించిన దస్త్రాల్లో పేర్కొన్నారు. చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి థర్డ్‌ పార్టీలను కూడా వాళ్లు ఆశ్రయించినట్లు పోలీసులు కోర్టుకి తెలియజేశారు. ప్రస్తుతం ఈ ముగ్గురు బెయిల్‌పై బయటకు వచ్చారు. తదుపరి విచారణ నిమిత్తం మే 13వ తేదీన కోర్టులో హాజరుకానున్నారు. ఈ కేసులో దోషులుగా తేలితే పది సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశముంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు