అమెరికాలో కలకలం... పిల్లులకు కూడా కరోనా...

గురువారం, 23 ఏప్రియల్ 2020 (09:31 IST)
కంటికి కనిపించకుండా ప్రపంచాన్ని తన గుప్పెట్లో బంధిస్తున్న కరోనా వైరస్.. ఇప్పటివరకు కేవలం మనుషులకు మాత్రమే సోకుతుందని భావించారు. కానీ, అమెరికాలో జరిపిన తాజా పరిశోధనలలో పిల్లులకు కూడా ఈ వైరస్ సోకుతందని తేలింది. దీనికి నిదర్శనంగా అమెరికాలో తొలిసారి రెండు పిల్లులకు ఈ వైరస్ సోకింది.
 
అమెరికా దేశంలోని న్యూయార్క్ రాష్ట్రంలో రెండు పెంపుడు పిల్లులకూ కొవిడ్-19 వచ్చిందని అమెరికా వైద్యాధికారులు ప్రకటించారు. రెండు పెంపుడు పిల్లులకు కొవిడ్ -19 సోకిందని అమెరికా దేశానికి చెందిన డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రీవెన్షన్ (సీడీసీ), యూఎస్ డీఏ నేషనల్ వెటర్నరీ సర్వీసెస్ లాబోరేటరీస్ (ఎన్‌విఎస్ఎల్) ధ్రువీకరించాయి. 
 
కరోనా వైరస్ సోకిన రెండు పెంపుడు పిల్లులు న్యూయార్క్ రాష్ట్రంలో వేర్వేరు చోట్ల నివశిస్తున్నాయని, ఇవి శ్వాసకోస సమస్యలతో బాధపడుతున్నాయని డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రీవెన్షన్ అధికారులు చెప్పారు. ఈ పెంపుడు పిల్లులున్న గృహాలలో ఎవరికీ కరోనా సోకలేదని యూఎస్ అధికారులు గుర్తుచేశారు.
 
కాగా, న్యూయార్క్ రాష్ట్రంలో 2,58, 589 మందికి కరోనా సోకగా, వారిలో 15,302 మంది మరణించారు. ఒక్క న్యూయార్క్ నగరంలోనే 1,41,235 మందికి ఈ వైరస్ సోకింది. మొత్తంమీద రెండు పెంపుడు పిల్లులకు కూడా కరోనా సోకడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు