ఉక్రెయిన్‌లో మారణహోమం సృష్టిస్తున్న రష్యా

సోమవారం, 21 మార్చి 2022 (07:49 IST)
ఉక్రెయిన్‌పై దండయాత్ర సాగిస్తున్న రష్యా ఉద్దేశ్యపూర్వకంగా మారణహోమం సృష్టిస్తున్నాయి. తాజాగా మేరియుపోల్‌లో 400 మంది ఆశ్రయం పొందుతున్న ఓ ఆర్ట్ స్కూల్ భవనంపై రష్యా సేనలు బాంబులతో విరచుకుపడ్డాయి. దీంతో ఈ భవనం నేలమట్టమైంది. ఇందులో తలదాచుకున్న అనేకమంది ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. 
 
ఇదిలావుంటే, గత నెల 23వ తేదీన ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రారంభించిన రష్యా... క్రమక్రమంగా పట్టుసాధిస్తూ వస్తోంది. ఈ క్రమంలో పలు కీలక నగరాలను తమ ఆధీనంలోకి తెచ్చుకుంటుంది. తాజాగా అత్యంత కీలక నగరంగా భావించే మేరియుపోల్‌ నగరంపై కూడా పూర్తిపట్టు సాధించింది. అయితే, రాజధాని కీవ్ నగరం సమీపంలో ఉన్న రష్యా బలగాలు మాత్రం పట్టు సాధించలేక పోతున్నాయి. కానీ, మేరియుపోల్‌ను మాత్రం సులభంగానే ఆధీనంలోకి తీసుకుంది. 
 
మరోవైపు, రష్యా మూర్ఖత్వంలో యుద్ధం చేస్తుందని స్విట్జర్లాండ్ అధ్యక్షుడు ఇగ్నాజియో కాసిస్ అన్నారు. అయితే, తాము ఉక్రెయిన్ ప్రజాస్వామ్యం, స్వాంత్ర్యాలకు మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు. దీనివల్ల భవిష్యత్‌లో ఎదురయ్యే పరిణామాలు ఎలాంటివైనా మూల్యం చెల్లించేందుకు సిద్ధఁగా ఉన్నామని ఆయన తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు